BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 15 July 2026, 08:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జార్జిపేటలో సూర్య ఘర్ సోలార్ ప్యానెల్స్‌పై క్షేత్రస్థాయి తనిఖీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 08:51 PM
49 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

పనితీరు, భద్రతా ప్రమాణాలపై అధికారుల పరిశీలన – ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలే లక్ష్యం

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం జార్జిపేట గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సూర్య ఘర్ సోలార్ పథకం కింద ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్‌ను చింతలపూడి ఎలక్ట్రికల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీ) రాంబాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా సోలార్ ప్యానెల్స్ పనితీరు, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, భద్రతా ప్రమాణాలు, నిర్వహణ విధానాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పథకం ద్వారా లబ్ధిదారులకు ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైన నిర్వహణ పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

సూర్య ఘర్ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందడంతో పాటు విద్యుత్ బిల్లుల భారం తగ్గించి స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పథకం ప్రయోజనాలు ప్రతి అర్హ కుటుంబానికి పూర్తిస్థాయిలో చేరేలా విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని వెల్లడించారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో విద్యుత్ శాఖ లైన్మెన్ రెడ్డి నాయక్ పాల్గొన్నారు.