BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

జూలై 31 లోగా పనులు పూర్తి చేయాలి

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
17 Mar, 2026 - 05:50 AM
82 వీక్షణలు

కరీంనగర్: జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 563 నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం భారత జాతీయ రహదారి సంస్థ (NHAI) వరంగల్ ప్రాజెక్ట్ సంచాలకులు భరద్వాజ్, ఆర్డీఓ మహేశ్వర్ మరియు ఇతర అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరంగల్ నుండి కరీంనగర్ వరకు ఇప్పటికే 89 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను ఈ ఏడాది జూలై 31 లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భూసేకరణ వంటి పెండింగ్‌లో ఉన్న సమస్యలను రెవెన్యూ మరియు NHAI అధికారులు సమన్వయంతో త్వరగా పరిష్కరించాలని సూచించారు.

కొత్తపల్లి-హుస్నాబాద్ రహదారిపై సమీక్ష:

అనంతరం కొత్తపల్లి-చిగురుమామిడి-హుస్నాబాద్ నాలుగు వరుసల రహదారి నిర్మాణ పురోగతిని కూడా కలెక్టర్ సమీక్షించారు. విద్యుత్ స్తంభాల తొలగింపు, పునర్నిర్మాణం మరియు భూసేకరణ పనులపై ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ పనులపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తానని ఆమె స్పష్టం చేశారు.