జైన్ కుటుంబ సభ్యులకు ప్రపంచ నవకర్ మహా మంత్ర దివాస్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ చిన్నికూర్
జైన్ కుటుంబ సభ్యులకు ప్రపంచ నవకర్ మహా మంత్ర దివాస్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ చిన్నికూర్
విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య వారి కళాక్షేత్రంలో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (JITO) ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ నవకర్ మంత్ర దివస్ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని)
కేశినేని చిన్నికి ఘనస్వాగతం పలికిన వేలాదిమంది జైన్ లు, జైన్ సంఘ పెద్దలు
జైన్ కుటుంబ సభ్యులందరికీ ప్రపంచ నవకర్ మహా మంత్ర దివస్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ చిన్ని
ఎంపీ కేశినేని చిన్ని కామెంట్స్::
ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో, సుమారు 9000 సెంటర్లలో ప్రపంచ నౌకార్ మహాతంత్ర దివస్ నిర్వహించడం అభినందనీయం
విజయవాడలో వేలాది మంది మహామంత్ర దివస్ లో పాల్గొనడం ఓ పండుగ వాతావరణంగా కనిపిస్తోంది
నవకార్ మహామంత్రం అనేది మనసుకి ప్రశాంతతను, స్థిరత్వాన్ని మరియు సమాన భావాన్ని ప్రసాదించే ఒక పవిత్ర శక్తి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జైన్ గురువుల ఆచారాలను పాటించడం వల్లే ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగారు
ఆయన మనసు ప్రశాంతంగా ఉండడానికి ఈ మంత్రమే కారణమని తెలుస్తోంది
అరిహంతులు, సిద్ధులు, ఆచార్యులు వంటి మహోన్నత గురువులు చూపిన బాటలో నడవడమే నవకర్ మహా మంత్ర ప్రధాన ఉద్దేశ్యం
బయట ఉన్న శత్రువుల కంటే మనలోని అహంకారం, కోపం, లోభితనం వంటి ప్రతికూల ఆలోచనలను జయించడమే నిజమైన విజయమని భగవాన్ మహావీరుడు బోధించారు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం తన కోపాన్ని విడనాడి శాంతియుత భావాలతో పరోక్షంగా జైన్ మత సిద్ధాంతాలతో నడుస్తున్న నాయకులు
ప్రపంచ నవకార్ మహామంత్ర దివస్ కార్యక్రమానికి దేశ హోం మంత్రి అమిత్ షా సైతం పాల్గొని సందేశం ఇవ్వడం, విజయవాడలో ఈ కార్యక్రమంలో నాకు ఎంతో సంతోషంగా ఉంది
విజయవాడ నగరాన్ని గొప్ప వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దడంలో జైన్ సమాజం చేసిన కృషి మరువలేనిది
పేద ప్రజల కోసం జైన్ సమాజం నిర్వహిస్తున్న విద్యా, వైద్య మరియు అన్నదాన కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి
జైన్ సమాజం కోరిన విధంగా స్కూల్ , హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత మంత్రులను కలిసి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తా
విజయవాడ మరియు అమరావతి రాజధాని అభివృద్ధిలో జైన్ సమాజం జైన్ యువత చురుకైన పాత్ర పోషించాలి