www.ntodaynews.com
జగిత్యాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
తెలంగాణ
జగిత్యాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
- విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల, ఏప్రిల్ 14 (న్యూస్):
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కలిసి జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే నేడు బడుగు, బలహీన వర్గాలకు హక్కులు లభిస్తున్నాయని కొనియాడారు. సమాజంలో అసమానతలు తొలగిపోవాలన్న అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అయిల్నేని వెంకటేశ్వర్ రావు, జగిత్యాల రూరల్ మండల అధ్యక్షుడు అయిల్నేని ఆనంద్ రావు, బిఆర్ఎస్ (BRS) నాయకులు, అంబేడ్కర్ అభిమానులు మరియు ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.