జగన్ వైఖరి మారకుంటే భవిష్యత్తు లేనట్లే!
జగన్ వైఖరి మారకుంటే భవిష్యత్తు లేనట్లే!
రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ భాగస్వామ్య తెలుగుదేశం, జనసేన, బిజెపి, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా ఉద్యమం చేపట్టడం ద్వారా మాత్రమే జగన్ ప్రజాదరణ పొందగలరు, తప్ప శాపనార్ధాలు, పెడబొబ్బలు, హెచ్చరికలు ఏమాత్రం ఉపయోగపడవని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ విమర్శించారు. ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడుతున్న పత్రికలు, మీడియా తోడ్పాటు లేకుంటే ఏ రాజకీయ పార్టీ మనుగడ కొనసాగించలేదన్నారు. విమర్శ స్వీకరించే మనస్తత్వం ప్రతి రాజకీయ నాయకుడు అలవర్చుకొని, దానికి దీటైన జవాబు ఇచ్చే విధంగా వైఖరి మార్చుకోవాలని హరినాథ్ హితవు చెప్పారు. నేడు రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి-సాక్షి ఒక్కో రాజకీయ పార్టీకి ప్రచార సాధనాలుగా మారాయి అనటంలో సందేహం లేదన్నారు. అసత్యాలు రాస్తే తిరిగి ఖండనల రూపంలో పంపవచ్చు. కార్యాలయాలపై దాడులు చేయటం, యాజమాన్యాన్ని "మేము అధికారంలోకొస్తే మీ అంతు తేలుస్తాం" అని బెదిరించటం సరికాదని హరినాథ్ ఖండించారు.