BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

జి.కొండూరులో ఎమ్మెల్యే సడన్ ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Mar, 2026 - 07:49 PM
135 వీక్షణలు

జి.కొండూరులో ఎమ్మెల్యే సడన్ ఎంట్రీ.. మధ్యాహ్న భోజనంపై సీరియస్ హెచ్చరిక!

ఎన్టీఆర్ జిల్లా, మార్చి 26:

జి.కొండూరు జెడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకంపై అకస్మికంగా దాడి చేసిన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అధికారులను అలర్ట్ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా స్కూల్‌కి చేరుకున్న ఎమ్మెల్యే, నేరుగా వంటశాలకు వెళ్లి భోజనం తయారీ విధానం, నిల్వలు, పరిశుభ్రతపై సవివరంగా పరిశీలించారు.

భోజనం రుచి, నాణ్యతపై స్వయంగా తనిఖీ చేయడానికి విద్యార్థులతో కలిసి కూర్చొని భోజనం చేసిన ఎమ్మెల్యే, “పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ ఉండదు” అని గట్టిగా హెచ్చరించారు. కొన్నిచోట్ల చిన్నపాటి లోపాలు గమనించిన ఆయన, వాటిపై వెంటనే సిబ్బందిని ప్రశ్నిస్తూ క్లాస్ తీసుకున్నారు.

విద్యార్థులతో మాట్లాడి, భోజనం సరైనదిగా ఉందా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పిల్లలు తమ సమస్యలు చెప్పడంతో వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

“మధ్యాహ్న భోజనం పథకం పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉంది. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవు” అంటూ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. దీంతో పాఠశాల సిబ్బందిలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.