BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

జి.కొండూరులో ఎమ్మెల్యే సడన్ ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Mar, 2026 - 07:49 PM
93 వీక్షణలు

జి.కొండూరులో ఎమ్మెల్యే సడన్ ఎంట్రీ.. మధ్యాహ్న భోజనంపై సీరియస్ హెచ్చరిక!

ఎన్టీఆర్ జిల్లా, మార్చి 26:

జి.కొండూరు జెడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకంపై అకస్మికంగా దాడి చేసిన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అధికారులను అలర్ట్ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా స్కూల్‌కి చేరుకున్న ఎమ్మెల్యే, నేరుగా వంటశాలకు వెళ్లి భోజనం తయారీ విధానం, నిల్వలు, పరిశుభ్రతపై సవివరంగా పరిశీలించారు.

భోజనం రుచి, నాణ్యతపై స్వయంగా తనిఖీ చేయడానికి విద్యార్థులతో కలిసి కూర్చొని భోజనం చేసిన ఎమ్మెల్యే, “పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ ఉండదు” అని గట్టిగా హెచ్చరించారు. కొన్నిచోట్ల చిన్నపాటి లోపాలు గమనించిన ఆయన, వాటిపై వెంటనే సిబ్బందిని ప్రశ్నిస్తూ క్లాస్ తీసుకున్నారు.

విద్యార్థులతో మాట్లాడి, భోజనం సరైనదిగా ఉందా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పిల్లలు తమ సమస్యలు చెప్పడంతో వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

“మధ్యాహ్న భోజనం పథకం పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉంది. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవు” అంటూ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. దీంతో పాఠశాల సిబ్బందిలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.