BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

జి.కొండూరులో ఎమ్మెల్యే సడన్ ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Mar, 2026 - 07:49 PM
70 వీక్షణలు

జి.కొండూరులో ఎమ్మెల్యే సడన్ ఎంట్రీ.. మధ్యాహ్న భోజనంపై సీరియస్ హెచ్చరిక!

ఎన్టీఆర్ జిల్లా, మార్చి 26:

జి.కొండూరు జెడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకంపై అకస్మికంగా దాడి చేసిన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అధికారులను అలర్ట్ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా స్కూల్‌కి చేరుకున్న ఎమ్మెల్యే, నేరుగా వంటశాలకు వెళ్లి భోజనం తయారీ విధానం, నిల్వలు, పరిశుభ్రతపై సవివరంగా పరిశీలించారు.

భోజనం రుచి, నాణ్యతపై స్వయంగా తనిఖీ చేయడానికి విద్యార్థులతో కలిసి కూర్చొని భోజనం చేసిన ఎమ్మెల్యే, “పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ ఉండదు” అని గట్టిగా హెచ్చరించారు. కొన్నిచోట్ల చిన్నపాటి లోపాలు గమనించిన ఆయన, వాటిపై వెంటనే సిబ్బందిని ప్రశ్నిస్తూ క్లాస్ తీసుకున్నారు.

విద్యార్థులతో మాట్లాడి, భోజనం సరైనదిగా ఉందా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పిల్లలు తమ సమస్యలు చెప్పడంతో వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

“మధ్యాహ్న భోజనం పథకం పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉంది. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవు” అంటూ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. దీంతో పాఠశాల సిబ్బందిలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.