BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

జి.కొండూరులో పల్స్ పోలియోకు సర్వం సిద్ధం.. 3,336 మంది చిన్నారులకు చుక్కలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 07:17 PM
45 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలంలో ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. మండలంలోని ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

మండల వ్యాప్తంగా 3,336 మంది ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించిన అధికారులు, వారికి పోలియో చుక్కలు వేసేందుకు 23 బూత్‌లను ఏర్పాటు చేశారు. కార్యక్రమం నిర్వహణ కోసం వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, సూపర్వైజర్లతో కూడిన ప్రత్యేక బృందాలను నియమించారు.

జూన్ 28న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బూత్‌ల వద్ద పోలియో చుక్కలు వేయనుండగా, 29 మరియు 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిన చిన్నారులకు చుక్కలు వేయనున్నారు. ఒక్క చిన్నారి కూడా మిగలకుండా చూడాలనే లక్ష్యంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

పోలియో నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్న వైద్యాధికారి, తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. "రెండు చుక్కలతో జీవితాంతం రక్షణ" అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.