జిల్లా స్థాయి ‘పీఎం శ్రీ’ పాఠశాలల MUN మరియు స్పెల్-బీ పోటీలు
జిల్లా స్థాయి ‘పీఎం శ్రీ’ పాఠశాలల MUN మరియు స్పెల్-బీ పోటీలు: విజేతలకు బహుమతుల ప్రధానం
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం (మార్చి 17) జిల్లాలోని పీఎం శ్రీ (PM SHRI) పాఠశాలల విద్యార్థులకు జిల్లా స్థాయి మోడల్ యునైటెడ్ నేషన్స్ (MUN) మరియు స్పెల్-బీ (Spell-Bee) పోటీలను ఘనంగా నిర్వహించారు.
పోటీల వివరాలు:
మోడల్ యునైటెడ్ నేషన్స్ (MUN): ఈ పోటీలకు 22 పాఠశాలల నుండి 40 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
స్పెల్-బీ (Spell-Bee): ఈ పోటీలో పీఎం శ్రీ పాఠశాలల నుండి 36 మంది విద్యార్థులు పాల్గొనగా, వారిలో 10 మంది విద్యార్థులను విజేతలుగా ఎంపిక చేశారు.
విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారులు మెమెంటోలు, సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు.
ముఖ్య అతిథులు:
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీ అశోక్ రెడ్డి, డిసిఇబి కార్యదర్శి శ్రీ భగవంతయ్య, జిల్లా సైన్స్ అధికారి శ్రీ జయపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు.
న్యాయ నిర్ణేతలు:
MUN పోటీలకు బి. తిరుపతి, ఏ. కుమారస్వామి, ఆర్. పవన్ కుమార్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించగా.. స్పెల్-బీ పోటీలను వినయధర్ రాజు, శివకుమార్, మంజూర్ అలీ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు