BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు వదంతులను నమ్మవద్దు

తెలంగాణ
/ నల్గొండ / నల్గొండ
26 Mar, 2026 - 05:08 AM
143 వీక్షణలు

జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు  వదంతులను నమ్మవద్దు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.  

జిల్లాలో పెట్రోల్ మరియు డీజిల్ కొరత ఎక్కడా లేదని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అసత్య వదంతుల కారణంగా ప్రజలు అనవసర ఆందోళనకు గురవుతూ, ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి ఇంధనం నింపించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు.


జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఎటువంటి కొరత పరిస్థితి లేదని, ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించవద్దని సూచించారు. అలా చేయడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలగడంతో పాటు అనవసర గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.


సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నిర్ధారించని సమాచారాన్ని నమ్మకూడదని, అలాంటి సమాచారాన్ని ఇతరులకు పంపించడం ద్వారా వదంతులు వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ప్రజలు తమ సాధారణ అవసరాల మేరకే ఇంధనం వినియోగించుకోవాలని, ఎలాంటి భయభ్రాంతులకు గురికావద్దని కోరారు.


జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని, వదంతులు వ్యాప్తి చేయడం లేదా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు పాల్పడితే, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.