BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

జనాభా లెక్కల పేరిట సైబర్ మోసాలు: అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
04 Jun, 2026 - 02:41 PM
10 వీక్షణలు

అన్నమయ్య జిల్లా మదనపల్లి: ప్రజల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించేందుకు సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాను ఎంచుకుంటున్నారని, ప్రస్తుతం జనాభా లెక్కల (సెన్సస్) పేరుతో సాగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ హెచ్చరించారు.గురువారం మదనపల్లిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇటీవలి కాలంలో సైబర్ కేటుగాళ్లు జనాభా లెక్కల నమోదు అధికారులమంటూ ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ లు, వాట్సాప్ లింకుల ద్వారా ప్రజలను సంప్రదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిజిటల్ సర్వే చేస్తున్నామని నమ్మిస్తూ.. ఆధార్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్లు సేకరించి, ఆపై మీ మొబైల్ నంబర్లకు వచ్చే ఓటీపీలను అడిగి క్షణాల్లో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని ఎస్పీ  పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారిక యంత్రాంగం ఎన్నడూ ఫోన్లలో గానీ, అనుమానాస్పద లింకుల ద్వారా గానీ బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, ఏటీఎం పిన్ నంబర్లు అడగరనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. మొబైల్ ఫోన్లకు వచ్చే ఎటువంటి అపరిచిత లింకులపై క్లిక్ చేయవద్దని, ఒకవేళ పొరపాటున ఎవరైనా ఇలాంటి సైబర్ మాయగాళ్ల బారిన పడి ఆర్థికంగా నష్టపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 అనే టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. బాధితులు ఎంత త్వరగా స్పందిస్తే అంత వేగంగా పోగొట్టుకున్న సొమ్మును ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుందని, ప్రజల అప్రమత్తతే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేస్తుందని ఈ సందర్భంగా ఎస్పీ  స్పష్టం చేశారు.