రైతన్న మీకోసం కార్యక్రమం ఘనంగా నిర్వహణ
జనార్ధనవరం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం ఘనంగా నిర్వహణ
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో “రైతన్న మీకోసం” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రైతుల సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలను సూచించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో చాట్రాయి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ పాల్గొని రైతులతో మమేకమయ్యారు. అలాగే జనార్ధనవరం గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు మాదాసు చిన్న పుల్లయ్య, నీటి సంఘం అధ్యక్షుడు వంగల సుబ్బారావు, బూత్ ఇన్చార్జ్ రామారావు, గ్రామ జనరల్ సెక్రటరీ రాచకొండ కృష్ణ తదితరులు హాజరయ్యారు.
అలాగే వంగల రమేష్, కొనకాల శ్రీనివాసరావు, కొనకాల శివయ్య, మంగళ లక్ష్మీనారాయణ, మాదాసు వెంకటనారాయణ, బండారు నాగరాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా రైతుల సమస్యలు, పంటల పరిస్థితులు, నీటి వనరుల నిర్వహణపై చర్చించి అవసరమైన సూచనలు చేశారు.