Health: జనార్ధనవరం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని పిలుపు
ఏలూరు జిల్లా | నూజివీడు నియోజకవర్గం | జూన్ 29 | NTODAY NEWS
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ, గ్రామ టీడీపీ అధ్యక్షుడు మాదాసు చిన్న పుల్లయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, పోలియో వ్యాధి పూర్తిగా నిర్మూలించాలంటే ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయాలని సూచించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి టీకా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.