BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

జనార్ధనవరంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 11:35 AM
227 వీక్షణలు

జనార్ధనవరంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడినాయి. గ్రామ పార్టీ అధ్యక్షుడు మాదాసు చిన్న పుల్లయ్య, మండల పార్టీ అధ్యక్షుడు ఇజ్జగాని వెంకటేశ్వరరావు, చాట్రాయి మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ ఆవిర్భావం వెనుక ఉన్న లక్ష్యాలు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధానాలను స్మరించుకున్నారు.

కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు వంగల సుబ్బారావు, టిడిపి ఉపాధ్యక్షుడు పామర్తి నాగరాజు, తెలుగు యువత ఉపాధ్యక్షుడు బొద్దు వెంకటేశ్వరరావు, గ్రామ పార్టీ సెక్రటరీ బలువూరి రత్తయ్య, వంగల రమేష్, ఆడమిల్లి మోషే, పులపాక రఘు, నడిపింటి వెంకటేశ్వరరావు, బొరిగొర్ల తిరుపతిరావు, మాదిరాజు ప్రసాదు, గోపాలస్వామి, రాచకొండ కృష్ణ, చీప్ వెంగళరావు, నందమూరి ఏసుబాబు, కొనకాల చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.

పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.