BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

జనసేనలో కొత్త రాజకీయ సంస్కృతికి నాంది.. పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 04:17 PM
80 వీక్షణలు

జనసేన పార్టీని కేడర్ ఆధారిత రాజకీయ శక్తిగా మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో “జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల” ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న జనసైనికులు, సాధకులు, నాయకులను గుర్తించి వారికి తగిన బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో ఈ కమిటీలు పనిచేయనున్నాయి. జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన ఈ వ్యవస్థలో నాయకుల సేవలు, ప్రజల్లో వారి ఆదరణ, నాయకత్వ లక్షణాలు, పార్టీ పట్ల నిబద్ధత వంటి అంశాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించి పార్టీ అధ్యక్షుడి పరిశీలనకు సమర్పిస్తారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్ నాయకులు, సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ముగ్గురు సాధకులు కలిపి 7 మంది ప్రధాన సభ్యులతో పాటు, వారికి సహకరించే 21 మంది సాధకులు ఈ కమిటీల్లో ఉంటారు. కమిటీలలో వీరమహిళలకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించారు.

ఈ కమిటీల కూర్పును కొణిదెల పవన్ కళ్యాణ్ స్వయంగా సమీక్షించి ఆమోదించారు. కమిటీలు అందించే నివేదికలు, పార్టీ ముఖ్య నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయాన్ని ఆయనే తీసుకోనున్నారు.

దశాబ్దన్నర క్రితమే రూపుదిద్దుకున్న “జనసైనికుల నుంచే నాయకత్వం” అనే ఆలోచనకు కార్యరూపం ఇస్తూ, క్షేత్రస్థాయిలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు కల్పించే దిశగా జనసేన పార్టీ ఈ వినూత్న ప్రక్రియను ప్రారంభించింది.