BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

జనసేనలో కొత్త రాజకీయ సంస్కృతికి నాంది.. పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 04:17 PM
31 వీక్షణలు

జనసేన పార్టీని కేడర్ ఆధారిత రాజకీయ శక్తిగా మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో “జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల” ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న జనసైనికులు, సాధకులు, నాయకులను గుర్తించి వారికి తగిన బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో ఈ కమిటీలు పనిచేయనున్నాయి. జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన ఈ వ్యవస్థలో నాయకుల సేవలు, ప్రజల్లో వారి ఆదరణ, నాయకత్వ లక్షణాలు, పార్టీ పట్ల నిబద్ధత వంటి అంశాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించి పార్టీ అధ్యక్షుడి పరిశీలనకు సమర్పిస్తారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్ నాయకులు, సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ముగ్గురు సాధకులు కలిపి 7 మంది ప్రధాన సభ్యులతో పాటు, వారికి సహకరించే 21 మంది సాధకులు ఈ కమిటీల్లో ఉంటారు. కమిటీలలో వీరమహిళలకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించారు.

ఈ కమిటీల కూర్పును కొణిదెల పవన్ కళ్యాణ్ స్వయంగా సమీక్షించి ఆమోదించారు. కమిటీలు అందించే నివేదికలు, పార్టీ ముఖ్య నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయాన్ని ఆయనే తీసుకోనున్నారు.

దశాబ్దన్నర క్రితమే రూపుదిద్దుకున్న “జనసైనికుల నుంచే నాయకత్వం” అనే ఆలోచనకు కార్యరూపం ఇస్తూ, క్షేత్రస్థాయిలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు కల్పించే దిశగా జనసేన పార్టీ ఈ వినూత్న ప్రక్రియను ప్రారంభించింది.