తిరుపతి జనసేన జిల్లా కార్యాలయంలో హరిప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిసిన పుంగనూరు జనసేన నాయకులు
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు
తిరుపతి జనసేన జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ను పుంగనూరు నియోజకవర్గ జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పుంగనూరు జనసేన నాయకులు కోలా సోమశేఖర్, పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ చిన్న రాయల్, పగడాల రమణ, శివ తదితరులు హాజరై పార్టీ బలోపేతం, పుంగనూరు నియోజకవర్గంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చించారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకెళ్లేలా సమన్వయంతో పనిచేయాలని డా. హరిప్రసాద్ నాయకులకు సూచించారు. పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నాయకులు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమాలపై కీలకంగా చర్చ జరిగినట్లు నాయకులు తెలిపారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube