BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

ప్రజా సమస్యలపై గళమెత్తిన జనసేన

తెలంగాణ
09 Feb, 2026 - 10:25 PM
221 వీక్షణలు
జనవాణి వేదికగా ప్రజా సమస్యలపై గళమెత్తిన జనసేన బస్సు షెల్టర్లు, కోనేరుకు పారుదలపై చర్యలు చేపడతామని హామీ NTODAY NEWS: పుంగనూరు పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి సోమవారం నిర్వహించే జానవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ జనసేన పార్టీ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జనసేన పుంగనూరు ఇంచార్జి సీరివేలు గంగాధర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పరిష్కారం కాని పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. బస్సు షెల్టర్లు లేక ఇబ్బందులు గత ప్రభుత్వ హయాంలో రోడ్డు వైడెనింగ్ పేరుతో తొలగించిన బస్సు షెల్టర్లను ఇప్పటివరకు తిరిగి ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కోనేరులో పారుదల సమస్య పుంగనూరులో రాజుల కాలంలో నిర్మితమైన పురాతన కోనేరులో భూభాగం నుంచి నీరు ప్రవహిస్తున్నప్పటికీ, సరైన పారుదల వ్యవస్థ లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఎన్‌ఆర్‌ఐ బృందంతో కలిసి అవసరమైన పరికరాలు ఏర్పాటు చేసి, వచ్చే 10 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. గత పాలనపై విమర్శలు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ప్రజా సమస్యలను పట్టించుకోలేదని, ప్రస్తుతం కూడా ప్రజా దర్బార్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించినా ఫలితాలు కనిపించడం లేదని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ప్రజల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పీలేరు ఇంచార్జి బెజవాడ దినేష్, లీగల్ సెల్ నాయకుడు సీవీ శ్రీనివాసులు, పట్టణ నాయకుడు భార్గవ్తో పాటు పార్టీ నాయకులు, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. #JanaVani #JanaSenaParty #PublicIssues #Punganur #CivicIssues #PublicGrievances #LocalGovernance #PeopleFirst Follow us on Website Facebook Instagram YouTube