జూబ్లీ నగర్లో నూతన వేబ్రిడ్జి ప్రారంభం రైతుల సౌకర్యార్థం ఎంఆర్ఆర్ ఏపీ ఆయిల్ ప్యాడ్ కలెక్షన్స్ సెంటర్లో ఏర్పాటు
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీ నగర్ సమీపంలో ఎంఆర్ఆర్ (మోరంపూడి రంగారావు) ఏపీ ఆయిల్ ప్యాడ్ కలెక్షన్స్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన వేబ్రిడ్జిని ఆదివారం ప్రారంభించారు. లింగపాలెం మాజీ ఎంపీపీ, లింగపాలెం సొసైటీ చైర్మన్ మోరంపూడి మల్లిఖార్జునరావు రిబ్బన్ కట్ చేసి వేబ్రిడ్జిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో నూతన వేబ్రిడ్జిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పంట ఉత్పత్తుల తూకం ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వం ఉండేలా ఈ సదుపాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమానికి లింగపాలెం మండలంలోని పలు గ్రామాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన రైతులు, గ్రామస్తులు హాజరయ్యారు. నూతన వేబ్రిడ్జి అందుబాటులోకి రావడంతో రైతులకు తూకం విషయంలో మరింత సౌలభ్యం కలుగుతుందని స్థానికులు తెలిపారు.