BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

జూన్ 19న తల్లికి వందనం నిధుల జమకు అవకాశం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 02:37 PM
41 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు అందిస్తున్న ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదలపై తాజా సమాచారం వెలువడింది. ఈ విద్యా సంవత్సరంలో కూడా పథకం కింద నగదు జమను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే చేయాలని ప్రభుత్వం ముందుగా భావించింది.

ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం జూన్ 12ననే నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేయాలని మొదట నిర్ణయించారు. అయితే లబ్ధిదారుల అర్హతలపై క్షేత్రస్థాయిలో జరుగుతున్న సమగ్ర పరిశీలన కారణంగా ఆ తేదీ వాయిదా పడినట్లు సమాచారం.

కారణం ఇదే

స్కూళ్ల నుంచి సేకరించిన విద్యార్థుల డేటాను సచివాలయాల స్థాయిలో తిరిగి పరిశీలిస్తున్నారు. అర్హులకే లబ్ధి అందేలా, అనర్హులు జాబితాలో చేరకుండా కఠిన మార్గదర్శకాల ప్రకారం తనిఖీలు కొనసాగుతున్నాయి.

దాదాపు 60 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉండటంతో డేటా ధృవీకరణ ప్రక్రియ ఆలస్యమవుతోంది.

తాజా అంచనా తేదీ

తాజా సమాచారం ప్రకారం జూన్ 19న నిధులు జమ చేసే అవకాశం ఉంది. ఒకటి రెండు రోజులు అటు ఇటుగా కూడా విడుదల జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచిస్తున్నారు. తుది జాబితా ఖరారైన తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది.