BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

జూన్ 19న తల్లికి వందనం నిధుల జమకు అవకాశం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 02:37 PM
94 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు అందిస్తున్న ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదలపై తాజా సమాచారం వెలువడింది. ఈ విద్యా సంవత్సరంలో కూడా పథకం కింద నగదు జమను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే చేయాలని ప్రభుత్వం ముందుగా భావించింది.

ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం జూన్ 12ననే నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేయాలని మొదట నిర్ణయించారు. అయితే లబ్ధిదారుల అర్హతలపై క్షేత్రస్థాయిలో జరుగుతున్న సమగ్ర పరిశీలన కారణంగా ఆ తేదీ వాయిదా పడినట్లు సమాచారం.

కారణం ఇదే

స్కూళ్ల నుంచి సేకరించిన విద్యార్థుల డేటాను సచివాలయాల స్థాయిలో తిరిగి పరిశీలిస్తున్నారు. అర్హులకే లబ్ధి అందేలా, అనర్హులు జాబితాలో చేరకుండా కఠిన మార్గదర్శకాల ప్రకారం తనిఖీలు కొనసాగుతున్నాయి.

దాదాపు 60 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉండటంతో డేటా ధృవీకరణ ప్రక్రియ ఆలస్యమవుతోంది.

తాజా అంచనా తేదీ

తాజా సమాచారం ప్రకారం జూన్ 19న నిధులు జమ చేసే అవకాశం ఉంది. ఒకటి రెండు రోజులు అటు ఇటుగా కూడా విడుదల జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచిస్తున్నారు. తుది జాబితా ఖరారైన తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది.