www.ntodaynews.com
జూన్ 1న ‘ప్రజావాణి’ రద్దు: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
ఉమ్మడి జిల్లాలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఉన్నందున వచ్చే సోమవారం (జూన్ 1వ తేదీన) మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు, దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని, జూన్ 1న కలెక్టరేట్కు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు