తెలంగాణలో త్వరలో ఇళ్లకు స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు
తెలంగాణలో త్వరలో ఇళ్లకు స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు
తెలంగాణలో గృహ విద్యుత్ వినియోగదారుల కోసం స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం సుమారు రూ.25,006 కోట్ల వ్యయంతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది.
కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టి, దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా గృహాలకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ మీటర్ల ద్వారా వినియోగదారులు ముందుగానే విద్యుత్ రీచార్జ్ చేసుకుని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు బిల్లింగ్లో పారదర్శకత పెరగడం, విద్యుత్ నష్టాలు తగ్గడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని అధికారులు భావిస్తున్నారు. కేంద్రం నుంచి అధికారిక ఆమోదం వచ్చిన తర్వాత అమలు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.