BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

తెలంగాణలో త్వరలో ఇళ్లకు స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 12:03 AM
7 వీక్షణలు

తెలంగాణలో త్వరలో ఇళ్లకు స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు

తెలంగాణలో గృహ విద్యుత్ వినియోగదారుల కోసం స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం సుమారు రూ.25,006 కోట్ల వ్యయంతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది.

కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టి, దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా గృహాలకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ మీటర్ల ద్వారా వినియోగదారులు ముందుగానే విద్యుత్ రీచార్జ్ చేసుకుని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు బిల్లింగ్‌లో పారదర్శకత పెరగడం, విద్యుత్ నష్టాలు తగ్గడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని అధికారులు భావిస్తున్నారు. కేంద్రం నుంచి అధికారిక ఆమోదం వచ్చిన తర్వాత అమలు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.