జూన్ 2 నుండి 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక ముగింపు వారోత్సవాలు
జూన్ 2 నుండి 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక ముగింపు వారోత్సవాలు
నల్గొండ జిల్లా చిట్యాల పురపాలక సంఘం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" (99 రోజుల కార్యాచరణ) ముగింపు వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సచివాలయంలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఆదేశాల మేరకు జూన్ 2 నుండి 12 వరకు ఈ ముగింపు వారోత్సవాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమాల నిర్వహణపై మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీత ఆధ్వర్యంలో కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది మరియు మెప్మా సిబ్బందితో ఒక ఉన్నత స్థాయి సన్నాహక సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చిట్యాల పట్టణంలోని వివిధ వార్డులలో ప్రజల భాగస్వామ్యంతో వార్డు సభలను నిర్వహించనున్నారు. ఈ సభలు క్రింది తేదీలలో జరగనున్నాయి:
జూన్ 4 నుండి జూన్ 10 వరకు ముగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ పాలకవర్గం తెలియజేశారు...