జయహో అమరావతి... ఆనందోత్సాహాల్లో పోలవరం
జయహో అమరావతి... ఆనందోత్సాహాల్లో పోలవరం గ్రామానికి చెందిన చాగంటి రాధాకృష్ణ
అమరావతికి చట్టబద్ధత దక్కడంతో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా “జయహో అమరావతి… జయహో అమరావతి” నినాదాలతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. క్యాంపు కార్యాలయంలో ముగ్గులు వేసి, దీపాలు వెలిగిస్తూ సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి గారితో కలిసి చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన యువనేత చాగంటి రాధాకృష్ణ పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధి రాష్ట్ర ప్రగతికి కీలకమని, ఈ చట్టబద్ధతతో ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊపిరి లభిస్తుందని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమరావతి కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి ఇది గర్వకారణమని పేర్కొన్నారు.