www.ntodaynews.com
ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
తెలంగాణ
ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
NTODAY NEWS : చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ‘స్త్రీ శక్తి దివస్’ ను పట్టణంలోని సాయి భారతి కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల పట్టణ కార్యదర్శి , మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు కొంపల్లి సూర్య మాట్లాడుతూ భారత వీరనారి, మొదటి స్వాతంత్రోద్యమంలో ధైర్యసహసాలను చూపించిన రాణి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి నాయకత్వం, త్యాగం, మాతృభూమి విముక్తి కోసం ఆమె చేసిన త్యాగాలను ఎంతో విలువైనవని అన్నారు., ఆమె స్ఫూర్తిని , ధైర్యసహసాలను , ఆత్మవిశ్వాసం , నాయకత్వ లక్షణాలను ప్రతి ఒక్క అమ్మాయి అలవర్చుకోవాలని ఆమె పోరాట స్ఫూర్తిని స్మరించుకోవడం భారత పౌరుల యొక్క బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో చిట్యాల పట్టణ ఉపాధ్యక్షుడు గణేష్ . యశ్వంత్ , ఫణింద్ర , శశి , కావ్య , మాధురి తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube