కాజా టోల్ ప్లాజా వసూళ్లపై ప్రభుత్వ సీరియస్
కాజా టోల్ ప్లాజా వసూళ్లపై ప్రభుత్వ సీరియస్
గుంటూరు: కాజా టోల్ ప్లాజా వద్ద కమర్షియల్ ట్యాక్స్ అధికారుల వసూళ్ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా స్పందించింది.
సీఎంఓ, డిప్యూటీ సీఎంఓ కార్యాలయాలతో పాటు నారా లోకేష్ కార్యాలయం కూడా ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
సోషల మీడియాలో వైరల్ అయిన వీడియోలతో ఈ ఘటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారుల అత్యుత్సాహంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బాపట్ల రేంజ్కు చెందిన డిసిటివో బాలాజీ నాయక్ వ్యవహారంపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎంఓ ఉన్నతాధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఈ నివేదిక ఆధారంగా సంబంధిత అధికారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.