BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

​కాంగ్రెస్ కో-ఆప్షన్ సభ్యుల ప్రకటన: లక్సెట్టిపేట మున్సిపాలిటీలో నలుగురు ఎంపిక

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
09 Apr, 2026 - 08:24 AM
56 వీక్షణలు

లక్సెట్టిపేట మున్సిపాలిటీకి సంబంధించి నలుగురు నూతన కో-ఆప్షన్ సభ్యుల ఎంపికను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ అధికారికంగా ప్రకటించారు.

బుధవారం స్థానిక విశ్రాంతి భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు పారదర్శకంగా ఈ ఎంపిక జరిగిందని తెలిపారు. మొత్తం 15 మంది పోటీ పడగా, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని చింత సువర్ణ-అశోక్, సయ్యద్ తైసిన్ (ముస్లిం మైనారిటీ), తొగిటి నరసింహ చారి (బీసీ), మరియు నక్క జాకబ్ (క్రైస్తవ మైనారిటీ)లను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. మున్సిపాలిటీ చరిత్రలో తొలిసారిగా క్రైస్తవ మైనారిటీకి అవకాశం ఇవ్వడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేయడమే కాకుండా, నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని, ముఖ్యంగా గూడెం దేవస్థానానికి రూ. 75 కోట్ల నిధుల ప్రతిపాదనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి-నరసయ్య, వైస్ చైర్మన్ మోత్కురి రాజేశ్వరి సహా పలువురు కౌన్సిలర్లు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.