మద్దుల గోపాల్రెడ్డిని కలిసిన రాంనూర్ కాంగ్రెస్ నాయకులు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ మద్దుల గోపాల్ రెడ్డిని కలిసిన రాంనూర్ కాంగ్రెస్ నాయకులు
మద్దుల గోపాల్రెడ్డిని కలిసిన రాంనూర్ కాంగ్రెస్ నాయకులు
కరీంనగర్ :-
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ మద్దుల గోపాల్ రెడ్డిని శుక్రవారం వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో కలిసిన నాయకులు, గోపాల్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించారు. అనంతరం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కార్యకర్తలు ముందుండాలని వారికి దిశానిర్దేశం చేశారు.
పాల్గొన్న నాయకులు:
గోపాల్ రెడ్డిని కలిసిన వారిలో రాంనూర్ గ్రామానికి చెందిన వెల్గటూర్ మండల యూత్ జనరల్ సెక్రెటరీ కుశనపల్లి లక్ష్మణ్, సోషల్ మీడియా కన్వీనర్ కె. దుర్గయ్య, నాయకులు కుశనపల్లి తిరుపతి, లింగంపల్లి రమేష్, కుశనపల్లి కృపాకర్ తదితరులు ఉన్నారు.