BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 30 August 2026, 07:48 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కాంగ్రెస్‌లో క్రమశిక్షణ లేకుంటే నష్టం....

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:48 AM
12 వీక్షణలు

కాంగ్రెస్‌లో క్రమశిక్షణ లేకుంటే నష్టం.. గీత దాటిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కోసం పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పార్టీ గీత దాటి వ్యవహరించే వారిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే నష్టం తప్పదని వ్యాఖ్యానించారు.

చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ క్యాబినెట్‌తో పాటు ప్రభుత్వంలోనూ కొన్ని మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. పార్టీలోని గ్రూపు తగాదాలను తగ్గించి, కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

పేదలకు అందించే పెన్షన్లను రూ.4 వేల వరకు పెంచాలని, రైతు భరోసా పథకాన్ని కొనసాగించాలని సూచించారు. 22ఏ భూముల సమస్యను పరిష్కరించాలని, ఉచిత పథకాలను తగ్గించి అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమకారులకు తగిన న్యాయం చేయాలని, పార్టీ క్యాడర్‌లో ఉన్న అసంతృప్తిని తొలగించే చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ అంశాలపై దృష్టి పెడితేనే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.