BREAKING
అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు
www.ntodaynews.com

కాణిపాకం వరసిద్ధి వినాయక స్థల పురాణం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 06:33 AM
109 వీక్షణలు

కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో బాహుదా నది ఒడ్డున వెలసిన అత్యంత పవిత్రమైన స్వయంభూ వినాయక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో మూడు అవిటితనాలతో బాధపడుతున్న ముగ్గురు అన్నదమ్ములు జీవించేవారు వారికి ఉన్న పావు ఎకరం పొలం “కాణి”గా పిలువబడేది కరువు సమయంలో నీటి కోసం ఆ పొలంలో బావి తవ్వుతుండగా ఒక పెద్ద శిల తగిలి కోపంతో దానిని కొట్టిన వెంటనే ఆ శిల నుండి రక్తం కారినట్లు ద్రవం ప్రవహించిందని చెబుతారు ఆ అద్భుత సంఘటనతో గ్రామమంతా భయభక్తులతో నిండిపోయింది అదే క్షణంలో ఆ ముగ్గురు అన్నదమ్ముల అవిటితనం తొలగిపోయి మాట వినికిడి చూపు లభించిందని స్థల పురాణం పేర్కొంటుంది అనంతరం ఆ బావిలో వెలసిన శిల స్వయంభూ వినాయక స్వామిగా గుర్తించబడింది కాలక్రమంలో భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు చెప్పుకుంటే అవి నెరవేరుతాయని విశ్వాసం పెరగడంతో స్వామికి వరసిద్ధి వినాయకుడు అనే పేరు స్థిరపడింది గర్భగుడిలోని బావి నీరు ఎప్పటికీ తగ్గదని స్వామి విగ్రహం పెరుగుతుందని బాహుదా నది వరదలు వచ్చినా గర్భగుడిలోకి నీరు రాదని వంటి విశిష్ట విశ్వాసాలు భక్తుల్లో బలంగా నిలిచాయి ఇదే కాణిపాకం స్థల పురాణం భక్తి విశ్వాసం అద్భుతాల సమ్మేళనంగా ఈ క్షేత్రం నిలుస్తోంది.