BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

కాణిపాకం వరసిద్ధి వినాయక స్థల పురాణం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 06:33 AM
154 వీక్షణలు

కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో బాహుదా నది ఒడ్డున వెలసిన అత్యంత పవిత్రమైన స్వయంభూ వినాయక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో మూడు అవిటితనాలతో బాధపడుతున్న ముగ్గురు అన్నదమ్ములు జీవించేవారు వారికి ఉన్న పావు ఎకరం పొలం “కాణి”గా పిలువబడేది కరువు సమయంలో నీటి కోసం ఆ పొలంలో బావి తవ్వుతుండగా ఒక పెద్ద శిల తగిలి కోపంతో దానిని కొట్టిన వెంటనే ఆ శిల నుండి రక్తం కారినట్లు ద్రవం ప్రవహించిందని చెబుతారు ఆ అద్భుత సంఘటనతో గ్రామమంతా భయభక్తులతో నిండిపోయింది అదే క్షణంలో ఆ ముగ్గురు అన్నదమ్ముల అవిటితనం తొలగిపోయి మాట వినికిడి చూపు లభించిందని స్థల పురాణం పేర్కొంటుంది అనంతరం ఆ బావిలో వెలసిన శిల స్వయంభూ వినాయక స్వామిగా గుర్తించబడింది కాలక్రమంలో భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు చెప్పుకుంటే అవి నెరవేరుతాయని విశ్వాసం పెరగడంతో స్వామికి వరసిద్ధి వినాయకుడు అనే పేరు స్థిరపడింది గర్భగుడిలోని బావి నీరు ఎప్పటికీ తగ్గదని స్వామి విగ్రహం పెరుగుతుందని బాహుదా నది వరదలు వచ్చినా గర్భగుడిలోకి నీరు రాదని వంటి విశిష్ట విశ్వాసాలు భక్తుల్లో బలంగా నిలిచాయి ఇదే కాణిపాకం స్థల పురాణం భక్తి విశ్వాసం అద్భుతాల సమ్మేళనంగా ఈ క్షేత్రం నిలుస్తోంది.