కారులో చిక్కుకొని ఐదేళ్ల చిన్నారి మృతి
కారులో చిక్కుకొని ఐదేళ్ల చిన్నారి మృతి NTODAY NEWS నార్కట్పల్లి
నార్కట్పల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పేర్ని సతీష్ కుమార్తె చేరన్య (5) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికులను కలచివేసింది. వివరాల ప్రకారం, చిన్నారి ఉదయం ఇంటి ముందు ఆడుకోవడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లి నాగదన గాయత్రి కుటుంబ సభ్యులతో కలిసి పాప కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు.మధ్యాహ్నం సుమారు 1:15 గంటల సమయంలో ఇంటి ముందు పార్క్ చేసిన కారులో చిన్నారి ఆపస్మారక స్థితిలో పడిఉండగా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను నార్కట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ సమాచారం అందుకున్న నార్కట్పల్లి ఎస్సై పి. విష్ణుమూర్తి ఆసుపత్రికి చేరుకుని ఘటనపై విచారణ ప్రారంభించారు. చిన్నారి తల్లి నాగదన గాయత్రి ఫిర్యాదు మేరకు అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బాధిత కుటుంబానికి కాపీ అందజేశారు.చిన్నారి మృతిపై గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కారులో ఎంతసేపు ఉన్నది, ప్రమాదవశాత్తు జరిగిందా లేక మరేదైనా కారణమా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.