BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

టీడీపీ జనార్ధనవరం గ్రామానికి చెందిన వెంకటరత్నం చికిత్సకు రూ.1.79 లక్షల సహాయం.

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Mar, 2026 - 04:03 PM
140 వీక్షణలు

ఏలూరు జిల్లా :- నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో మానవత్వం మరోసారి మెరిసింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కొత్తపల్లి వెంకటరత్నం బ్రెయిన్‌లో నరాలు చిట్లి బ్లడ్ బ్లీడింగ్ అవ్వడంతో తీవ్ర అస్వస్థతకు గురై, నోటిమాట రాకుండా, కాలు-చేయి పనిచేయని పరిస్థితికి చేరుకున్నారు. వెంటనే ఆయనను విజయవాడలోని స్వర హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, తన మనసున్న మహారాజుగా మరోసారి నిలిచారు. ఆయన సహకారంతో పాటు గ్రామ టిడిపి అధ్యక్షులు మదాసు చిన్నపుల్లయ్య, చాట్రాయి మండల టిడిపి అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు కలిసి ముందుకు వచ్చారు.

గ్రామ టిడిపి ప్రధాన కార్యదర్శి బలువూరి రత్తయ్య ప్రభాకర్ ఆధ్వర్యంలో రూ.1,79,095 (లక్ష డెభై తొమ్మిది వేల తొంభై ఐదు రూపాయలు) విలువైన ఎల్వోసి చెక్కును వెంకటరత్నం కుమారుడు కొత్తపల్లి మురళికి అందజేశారు.

పార్టీ కార్యకర్త కష్టాల్లో ఉన్నప్పుడు తమవారిగా నిలబడటం తెలుగుదేశం పార్టీ సాంప్రదాయం అని నాయకులు పేర్కొన్నారు. గ్రామస్థులు, పార్టీ నాయకులు ఈ సహాయాన్ని అభినందిస్తూ, వెంకటరత్నం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.