www.ntodaynews.com
కాసేపట్లో యర్రగొండపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాసేపట్లో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని గంటవానిపల్లెకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించనున్నారు.
ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అలాగే వెలిగొండ నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు.
ఈ పర్యటనలో స్థానిక రైతులు, నిర్వాసితులతో సీఎం సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అనంతరం యర్రగొండపాలెం పర్యటన ముగించుకుని మధ్యాహ్నం గిద్దలూరుకు వెళ్లనున్న చంద్రబాబు, అక్కడ నిర్వహించే 'సంజీవని' కార్యక్రమంలో పాల్గొననున్నారు.