BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

కేజీ బేసిన్ గ్యాస్‌పై రాష్ట్రానికి 50 శాతం హక్కు ఇవ్వాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Apr, 2026 - 06:41 PM
106 వీక్షణలు

కేజీ బేసిన్ గ్యాస్‌పై రాష్ట్రానికి 50 శాతం హక్కు ఇవ్వాలి – అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్

కృష్ణా–గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తరించిన కేజీ బేసిన్ సహజ వాయువు సంపదపై ఆంధ్రప్రదేశ్‌కు న్యాయమైన వాటా కల్పించాలని అఖిల భారత కిసాన్ మహాసభ నాయకులు దినవహి హరినాథ్ డిమాండ్ చేశారు. “మన గ్యాస్ – మన హక్కు” అనే నినాదంతో రాష్ట్ర అసెంబ్లీలో 50 శాతం వాటా కోసం తీర్మానం చేయాలని ఆయన కోరారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్, ఇంధన ధరలు పెరిగి ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందన్నారు. గ్యాస్ ధరల పెరుగుదలతో హోటళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడగా, ఎరువుల ధరలు పెరిగి రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. పెట్రోలు ధరల పెరుగుదల కారణంగా రవాణా ఖర్చులు అధికమై నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సహజ న్యాయ సూత్రాల ప్రకారం రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే సహజ వనరులు ముందుగా రాష్ట్ర అవసరాలకు వినియోగించాలన్నారు. 12వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం సహజ వాయువులో 50 శాతం సంబంధిత రాష్ట్రాలకు కేటాయించాలనే నిబంధన అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 1978లో నరసాపురం సమీపంలో చమురు, గ్యాస్ అన్వేషణ ప్రారంభమై సహజ వాయువు కనుగొనబడిందని, తరువాత తాటిపాకలో మినీ శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయబడిందని వివరించారు. అనంతరం కేంద్రం తీసుకొచ్చిన నూతన అన్వేషణ విధానాల వల్ల ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పించబడటంతో కేజీ బేసిన్ గ్యాస్‌పై ప్రైవేటు సంస్థల ఆధిపత్యం పెరిగిందన్నారు.

కేజీ బేసిన్ ప్రాజెక్ట్‌లో భాగంగా లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని విమర్శించారు. వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని, లేదంటే ప్రాజెక్టును జాతీయీకరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు గ్యాస్ కొరత కారణంగా నిలిచిపోయాయని, అయినప్పటికీ ప్రభుత్వం ఆర్థిక భారం భరిస్తోందన్నారు. గ్యాస్ సరఫరా జరిగితే విద్యుత్ కొరత తగ్గి రాష్ట్రానికి ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.

గ్యాస్ తవ్వకాల వల్ల తీరప్రాంత ప్రజలు పర్యావరణ సమస్యలు, భూగర్భ మార్పులు, పొలాల నష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కష్టాలు రైతులవిగా ఉండగా లాభాలు కంపెనీలకు వెళ్లడం అన్యాయమని విమర్శించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను దూర రాష్ట్రాలకు తరలించడం అన్యాయమని, ముందుగా రాష్ట్ర అవసరాలు తీర్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు సరఫరా చేయాలని కోరారు. గ్యాస్‌ను రవాణా రంగం, గృహ అవసరాలకు వినియోగిస్తే ఖర్చులు తగ్గడమే కాక పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు.

అమరావతి రాజధాని కోసం జరిగినట్లే కేజీ బేసిన్ గ్యాస్ విషయంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పోరాడాలని దినవహి హరినాథ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సహజ వనరులపై హక్కు సాధించుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు.