BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: ఎస్ఎఫ్ఐ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 06:53 PM
31 వీక్షణలు

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: ఎస్ఎఫ్ఐ

తిరువూరు, జూలై 19: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ తిరువూరు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం బోసు బొమ్మ బస్‌స్టాప్ సెంటర్‌లో విద్యార్థులు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ ఎస్ఎఫ్ఐ నాయకుడు పంతంగి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్‌చుక్ గత 21 రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు.

ఆయన చేపట్టిన శాంతియుత దీక్షను భంగం చేసి పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని విమర్శించారు. ప్రభుత్వం దీక్షను భంగం చేసినప్పటికీ ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్ ఎం. సాజీ, అఖిల భారత సహాయ కార్యదర్శి ఐషే ఘౌష్ ఉద్యమాన్ని కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ నాయకుడు బి. వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం. రాఖీ, వర్ధన్, జగదీష్, బాలు, సాయి, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.