కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: ఎస్ఎఫ్ఐ
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: ఎస్ఎఫ్ఐ
తిరువూరు, జూలై 19: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ తిరువూరు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం బోసు బొమ్మ బస్స్టాప్ సెంటర్లో విద్యార్థులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ ఎస్ఎఫ్ఐ నాయకుడు పంతంగి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్చుక్ గత 21 రోజులుగా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు.
ఆయన చేపట్టిన శాంతియుత దీక్షను భంగం చేసి పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని విమర్శించారు. ప్రభుత్వం దీక్షను భంగం చేసినప్పటికీ ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్ ఎం. సాజీ, అఖిల భారత సహాయ కార్యదర్శి ఐషే ఘౌష్ ఉద్యమాన్ని కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ నాయకుడు బి. వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం. రాఖీ, వర్ధన్, జగదీష్, బాలు, సాయి, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.