BREAKING
ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు
www.ntodaynews.com

పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠకు మద్ధుల గోపాల్ రెడ్డికి ఆహ్వానం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
21 Mar, 2026 - 07:06 AM
77 వీక్షణలు

కిషన్ రావుపేట్ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠకు మద్ధుల గోపాల్ రెడ్డికి ఆహ్వానం: ఆలయ అభివృద్ధికి రూ.25,000 విరాళం

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట్ గ్రామంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీ మద్ధుల గోపాల్ రెడ్డిని గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు శనివారం ఆహ్వానించారు.

​ఈ సందర్భంగా మద్ధుల గోపాల్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధి నిమిత్తం ఆయన తన వంతు సహాయంగా రూ.25,000 (ఇరవై ఐదు వేల రూపాయలు) నగదును ముదిరాజ్ సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తి భావం వల్ల గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కోటిలింగాల ఆలయ చైర్మన్ మరియు ఉమ్మడి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి రమేష్, మాజీ ఎంపీటీసీ మాచర్ల రాజేందర్, గ్రామ శాఖా అధ్యక్షులు సత్యం, కుమ్మరి వెంకటేష్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్ట లక్ష్మణ్ పాల్గొన్నారు. అలాగే సంఘ సభ్యులు ప్రసాద్, వీరేష్, పోచయ్య, శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.