BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 18 February 2026, 07:36 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అమ్మవారిని దర్శించుకున్న కాకినాడ ఎంపీ

తెలంగాణ
18 Feb, 2026 - 07:36 AM
150 వీక్షణలు
తలుపులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ NTODAY NEWS: తుని ప్రతినిధి ప్రవీణ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బుధవారం తుని మండలం, లోవలో వేంచేసియున్న శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తుని నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలతో కలిసి ఆలయానికి చేరుకున్న ఎంపీకి ఈఓ విశ్వనాధరాజు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన ఎంపీకి ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందించారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీ వ్యాఖ్యలు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ — తలుపులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోవ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. చేపడుతున్న అభివృద్ధి పనులు రూ. 11 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణం రాజగోపురం నిర్మాణం మెట్ల దారి అభివృద్ధి వృద్ధుల సౌకర్యార్థం ఎస్కలేటర్ ఏర్పాటు దేవాదాయ శాఖ మరియు స్థానిక ఎమ్మెల్యే నిధులతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నిధుల కొరత లేనందున పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. డీసీసీబీ చైర్మన్, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు, జనసేన ఇంచార్జ్‌లు అనుశ్రీ సత్యనారాయణ, ఆకుల శ్రీనివాస్, నాయకులు నల్లం వాసు, కత్తిపూడి బాబీ, దండెం రామకృష్ణ, వీర మహిళ దీనా తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube