BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

అమ్మవారిని దర్శించుకున్న కాకినాడ ఎంపీ

తెలంగాణ
18 Feb, 2026 - 07:36 AM
32 వీక్షణలు
తలుపులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ NTODAY NEWS: తుని ప్రతినిధి ప్రవీణ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బుధవారం తుని మండలం, లోవలో వేంచేసియున్న శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తుని నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలతో కలిసి ఆలయానికి చేరుకున్న ఎంపీకి ఈఓ విశ్వనాధరాజు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన ఎంపీకి ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందించారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీ వ్యాఖ్యలు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ — తలుపులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోవ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. చేపడుతున్న అభివృద్ధి పనులు రూ. 11 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణం రాజగోపురం నిర్మాణం మెట్ల దారి అభివృద్ధి వృద్ధుల సౌకర్యార్థం ఎస్కలేటర్ ఏర్పాటు దేవాదాయ శాఖ మరియు స్థానిక ఎమ్మెల్యే నిధులతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నిధుల కొరత లేనందున పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. డీసీసీబీ చైర్మన్, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు, జనసేన ఇంచార్జ్‌లు అనుశ్రీ సత్యనారాయణ, ఆకుల శ్రీనివాస్, నాయకులు నల్లం వాసు, కత్తిపూడి బాబీ, దండెం రామకృష్ణ, వీర మహిళ దీనా తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube