BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

పిండం తినిపించేందుకు కాకిని కొనుగోలు చేసిన కుటుంబం!

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 08:59 AM
137 వీక్షణలు

కలికాలం వింత: పిండం తినిపించేందుకు కాకిని కొనుగోలు చేసిన కుటుంబం!

హైదరాబాద్‌లోని పురానాపూల్ శ్మశానవాటికలో వెలుగుచూసిన ఒక వింత ఘటన ప్రకృతిలో వస్తున్న మార్పులకు, మారుతున్న కాలానికి అద్దం పడుతోంది. హిందూ సంప్రదాయం ప్రకారం పితృదేవతలు కాకి రూపంలో వచ్చి పిండాన్ని స్వీకరిస్తారనే నమ్మకంతో ఒక కుటుంబం గంటల తరబడి వేచి చూసినా, నగరంలో పెరిగిన ఎండలు మరియు పట్టణీకరణ వల్ల ఒక్క కాకి కూడా దరిచేరలేదు. దీంతో చేసేదేమీ లేక, ఆ కుటుంబ సభ్యులు ముర్గి చౌక్ నుంచి ఒక కాకిని ప్రత్యేకంగా కొనుగోలు చేసి తెచ్చి పిండాన్ని ముట్టించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. కనీసం ఆచారాల నిర్వహణ కోసం కూడా పక్షులను కొనుగోలు చేయాల్సిన దుస్థితి రావడంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ‘కలికాలం అంటే ఇదేనేమో’ అంటూ జనం ఈ ఘటనపై చర్చించుకుంటున్నారు