కన్నడ శాఖలో బసవ జయంతి ఘనంగా జరిగింది
కన్నడ శాఖలో బసవ జయంతిని ఘనంగా నిర్వహించారు. కన్నడ శాఖాధీపతి డా. ఎమ్మెస్ దుర్గా ప్రవీణ అధ్యక్షత వహించి, బసవ తత్వం మరియు ఆయన జీవన విధానంలోని విశిష్టతను విశదీకరించారు.
ముఖ్య అతిథిగా ఆచార్య జయలలిత పాల్గొని, ఆధునిక సమాజంలో బసవ ఆలోచనల ప్రాముఖ్యతపై ప్రసంగించారు. పరిశోధక విద్యార్థులు
రూపేష్ కుమార్, అభిషేక్, నటరాజ్, మంజునాథ్, అనిల్ కుమార్ బసవ జీవిత చరిత్ర, తత్వం మరియు ఆయన సేవల గురించి ప్రసం చేశారు.
ఈ కార్యక్రమాన్ని వ్యాసరావు, తీర్థప్రసాద్, సదాశివ సమన్వయం చేశారు. పరిశోధక విద్యార్థులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఉపకులపతి ఆచార్య ఎల్ సి మల్లయ్య , మరియు రిజిస్ట్రార్ ఆచార్య కిరణ్ కుమార్ ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
డాక్టర్ పి ఎస్ గణేష్ మూర్తి
పి.ఆర్.ఓ ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం