MRPS: కొండమడుగులో 53వ వారపు జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహణ
కొండమడుగు | NTODAY NEWS
కొండమడుగు గ్రామంలో ఆదివారం ఎంఆర్పీఎస్ (MRPS) గ్రామ శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వద్ద 53వ వారపు జ్ఞానమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జ్ఞానమాల కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. నేటి యువత అంబేడ్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు.
డాక్టర్ అంబేడ్కర్ తన అపారమైన జ్ఞానం, దూరదృష్టితో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారని పేర్కొంటూ, యువత మహనీయుల అడుగుజాడల్లో నడిచి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ప్రతి ఆదివారం నిర్వహించే జ్ఞానమాల కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని అంబేడ్కర్ భావజాలాన్ని మరింత విస్తృతంగా చాటాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు, వార్డు సభ్యుడు కాడిగళ్ల బాబురావు, వార్డు సభ్యురాలు ఆర్ముల్లా లావణ్య శ్రీకాంత్, మంద భాస్కర్, బొడ్డు రజిత భాస్కర్, కడెం అశోక్, మాజీ సర్పంచ్ శివగళ్ల ఇస్తరి, మాజీ వైస్ ఎంపీపీ వాకిటి గణేష్ రెడ్డి, భూషపాక మల్లేష్, మాజీ ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు చిన్నగల్ల అశోక్, గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు చిన్నగల్ల లింగస్వామి, మాజీ ఎంపీటీసీ కడెం చంద్రశేఖర్, మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ కనకపోయిన రాజమల్లేష్, కనకపోయిన గోపాల్, చిన్నగల్ల గణేష్, బొడ్డు శివబాబు, అడిపే ఆంజనేయులు, కడెం బీరప్ప, శివగళ్ల ధనరాజ్, కొమ్ము భాస్కర్, ఎండి మున్నా, కనకపోయిన నవీన్, కడెం శ్రీకాంత్, ఎరుపుల సుక్కయ్య, కడెం నరసింహ, బద్దం బాబు, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.