తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్కు ఘన నివాళి
తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ ప్రేరణగా నిలిచిన Professor Kothapalli Jayashankar 15వ వర్ధంతి సందర్భంగా కొండమడుగు గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అరిగే శ్రీధర్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ సుర్వి వేణు గౌడ్, కడెం రాజేష్ బాబు, రంగ గోపాల్ గౌడ్, గాండ్ల రవి, పెంటబోయిన వేణు, కడెం కిరణ్, బొడ్డు భాస్కర్, చెరుకు భాస్కర్ గౌడ్, పంజాల శ్రీనివాస్ గౌడ్, ఆడెపు ఆంజనేయులు, కనకబోయిన నాగరాజు, మీసాల నర్సింహా, మేకల మహేష్, బద్దం మాధవ రెడ్డి, బొబ్బిలి సాయికుమార్, రామిడి మాధవ రెడ్డి, మహ్మద్ ఫెరోజ్ అలీ, ఉప్పల రంగాచారి, దూసరి హరిప్రసాద్, వట్నాల సాయి పవన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, స్వీయ పరిపాలన కోసం ఆయన జీవితాంతం చేసిన పోరాటం యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి తెలంగాణ వాసి బాధ్యత అని అన్నారు.