కొండమడుగు గ్రామంలో ఘనంగా దొడ్డి కొమురయ్య కురుమ 99 వ జయంతి సందర్భంగా నివాళులు
కొండమడుగు గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ 99 వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు
దొడ్డి కొమురయ్య తొలి అమరుడు జూలై 4, 1946న విస్నూర్ దేశ్ముఖ్ రామచంద్రా రెడ్డి గుండాల కాల్పుల్లో మరణించిన సాయుధ పోరాట తొలి యోధుడు.
దొరసాని వెట్టికి గొర్రెలను ఇవ్వొద్దని గొల్ల, కురుమలను చైతన్యపరిచి, వారి అస్తిత్వం కోసం పోరాడారు.
కొమురయ్య వీర మరణం తెలంగాణ ప్రజలలో తెగింపును పెంచి, సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసింది. వెట్టిచాకిరీ, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా గ్రామ సంఘాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు అని గుర్తు చేస్తూ.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కడెంపాడు రంగం మరియు కురుమ సంఘం, నాయకులు GMPS అధ్యక్షుడు మిర్యాల మైసయ్య, దొడ్డి మల్లయ్య, మిర్యాల కిష్టయ్య, దోడి భార్గవ్, మోటే వీరేష్ మోటే మహేష్, గంజి శివకుమార్ ,కడెం బీరప్ప మిర్యాల మహేష్,కడెం అనిల్ కుమార్, మిర్యాల సాయి నరె శంకర్, కడెం బాలకృష్ణ కడెం రాజు, ఇందూరి శ్రీశైలం గుజ్జ ముత్యాలు దొడ్డి శ్రీనివాస్ కడెం బాల మల్లయ్య బర్మా మల్లేష్ కడెం శ్రీశైలం దొడ్డి శరత్ కుర్మ యువత తదితరులు పాల్గొన్నారు.