BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

కొండమడుగు గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాశన కార్యక్రమం.

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
26 Apr, 2026 - 10:23 AM
155 వీక్షణలు

కొండమడుగు గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాశన కార్యక్రమం.

అన్నప్రాశన లేదా అన్నప్రాశనం పుట్టిన బిడ్డకు తొలిసారిగా అన్నం తినిపించే ఒక కార్యక్రమం. ఇది తెలుగువారి లోగిళ్ళలో కనిపించే ఒక కార్యక్రమం. ఈ సంస్కారం వలన శిశువుకు ఆయువు, ఆరోగ్యం, తేజస్సు వృద్ధి చెందుతాయని ప్రజలు విశ్వసిస్తారు.పిల్లలకు ఆరు లేక ఎనిమిది లేక పది నెలలు నిండిన తర్వాత గానీ, సంవత్సరం నిండిన తర్వాత గానీ శుక్లపక్షమునందు శుక్రుడు ఆకాశమందు పరిశుద్ధుడై ప్రకాశించుచున్నపుడు అన్నప్రాశనము చేయవలెనని ఋషులచే చెప్పబడినది (ముహూర్త దర్పణం). అన్నప్రాశన మగపిల్లలకు సరినెలలలోను, ఆడపిల్లలకు బేసి నెలలలోను చేయుట లోకాచారముగానున్నది. అన్నప్రాశన పూర్వాహ్ణమందు మాత్రమే చేయవలెను. బిడ్డ తల్లిదండ్రులు తూర్పుముఖంగా చాప మీద కూర్చుని బిడ్డను తల్లి ఒడిలో కూర్చోబెట్టుకోవాలి. ముందు విఘ్నేశ్వర పూజ చేయాలి. బంగారు గిన్నెలోగానీ, వెండి గిన్నె లేదా కంచంలోగానీ పాయసం, తేనె, పెరుగుల మిశ్రమాన్ని కలిపి, తండ్రి బంగారు ఉంగరాన్ని పాయసంలో ముంచి దాన్ని బిడ్డకు తినిపించాలి. ఉంగరంతో మూడుసార్లు తినిపించాక చేత్తో పెట్టాలి. ఈ విధంగా అన్నప్రాశన జరిగింది ఈ కార్యక్రమం అంగన్వాడి పరిధిలోని టీచర్ A శోభారాణి,రహీమునిస,అమల ఆధ్వర్యంలో చేయడం జరిగింది తల్లులు పిల్లలు పాల్గొన్నారు.