BREAKING
అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ తాడికొండ: గోపి మృతి పై పోలీసుల వివరణ .... పటాన్‌చెరు: పాఠశాలలో నాలుగు గదులకు శంకుస్థాపన ముత్యాలమ్మపాలెంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్..... అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ తాడికొండ: గోపి మృతి పై పోలీసుల వివరణ .... పటాన్‌చెరు: పాఠశాలలో నాలుగు గదులకు శంకుస్థాపన ముత్యాలమ్మపాలెంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్.....
Date of Publish : 19 July 2026, 07:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొండపర్వలో మంగళ్ పాండే జయంతి ఘనంగా నిర్వహింపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 07:32 PM
87 వీక్షణలు

కొండపర్వలో మంగళ్ పాండే జయంతి ఘనంగా నిర్వహింపు

విస్సన్నపేట, జూలై 19: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే జయంతిని ప్రముఖ సామాజిక కార్యకర్త, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి బోట్ల శివ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా బోట్ల శివ సత్యనారాయణ మంగళ్ పాండే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, 1857 తొలి స్వాతంత్ర్య సంగ్రామంలో వీరోచితంగా పోరాడి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు మంగళ్ పాండే అని కొనియాడారు. ఆయన త్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, దేశభక్తి, త్యాగస్ఫూర్తికి మంగళ్ పాండే చిరస్మరణీయ ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు.

నేటి యువత మంగళ్ పాండే జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని బోట్ల శివ సత్యనారాయణ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు దాసరి శివ, మరీదు ఉమామహేశ్వరరావు, వెంకన్న, బాలాజీ దుర్గ, మల్లేశ్వరరావు, కృష్ణవేణి, విద్యార్థులు యామిని, సాయి, మౌనిక, సత్యనారాయణ, మానస తదితరులు పాల్గొని మంగళ్ పాండేకు నివాళులర్పించారు.