www.ntodaynews.com
కూల్ డ్రింక్ అంటూ 7 ఏళ్ల బాలికకు మూత్రం తాగించిన ప్రధానోపాధ్యాయుడు.. అరెస్ట్
జాతీయం
బిహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు, ఒకటో తరగతి చదువుతున్న 7 ఏళ్ల బాలికకు కూల్ డ్రింక్ అని చెప్పి మూత్రం తాగించినట్లు పోలీసులు వెల్లడించారు.
“ఇది చల్లగా ఉంటుంది.. తాగి చూడు” అంటూ బాటిల్ మూతలో మూత్రం పోసి బాలికకు ఇచ్చినట్లు సమాచారం. విషయం అర్థమైన బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలిక కుటుంబం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందిత ప్రధానోపాధ్యాయుడిని అరెస్టు చేశారు. ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.