కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్నకు రూ.71.94 లక్షల బంగారు హారం బహూకరణ
కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్నకు రూ.71.94 లక్షల బంగారు హారం బహూకరణ
కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారికి విశాఖపట్నానికి చెందిన భక్తులు విలువైన బంగారు హారాన్ని సమర్పించారు.
విశాఖపట్నం వాస్తవ్యులు తెల్ల శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి దంపతులు, మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 463.920 గ్రాముల బంగారు హారాన్ని ఆలయానికి బహూకరించారు. ఈ బంగారు హారం విలువ సుమారు రూ.71,94,550గా ఆలయ అధికారులు తెలిపారు.
దాత కుటుంబ సభ్యులు బంగారు హారాన్ని ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావుకు అందజేశారు. అనంతరం స్వామివారి సేవల్లో భాగంగా హారాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు తమ్మన సాయి ప్రసాద్, మసకపల్లి త్రిమూర్తులు, వాడపల్లి సుందర శేషావతారం, పెండెం కుమారి, అర్చకులు, ఆలయ సిబ్బంది, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.