BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

కోట్ల ఆస్తులు.. రూ.75 లక్షల లంచం.. చివరకు కుటుంబంతో రైలు కిందపడి బలవన్మరణం

ఆంధ్రప్రదేశ్
/ నెల్లూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 08:51 PM
14 వీక్షణలు

నెల్లూరు జిల్లాలో సంచలనం రేపిన శ్రీహరి హత్య కేసులో వరుసగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హరికృష్ణ మంగళవారం తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గూడ్స్ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండల వ్యవసాయాధికారిగా పనిచేస్తున్న శ్రీహరి, తన బావమరిది హరికృష్ణను పూర్తిగా నమ్మి కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అతని పేరున రాసిచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఆస్తులను తిరిగి ఇవ్వాలని కోరడంతో శ్రీహరిని అడ్డుతొలగించాలని హరికృష్ణ కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులకు సుపారీ ఇచ్చిన హరికృష్ణ, జూన్ 15న శ్రీహరిని పెంచలకోనకు కారులో తీసుకెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ముందుగానే మాటువేసిన వ్యక్తులు కారును అడ్డగించి, శ్రీహరికి కుక్కలను చంపేందుకు ఉపయోగించే ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం గుండెపోటుతో మరణించాడని హరికృష్ణ కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు వెల్లడైంది.

మృతదేహంపై గాయాలు కనిపించినప్పటికీ స్థానిక పోలీసులు వెంటనే కేసు నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో తన భర్త అనుమానాస్పదంగా మరణించాడని, హత్య జరిగిందని ఆరోపిస్తూ శ్రీహరి భార్య లావణ్య జూలై 6న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో కేసు కొత్త మలుపు తిరిగింది.

దర్యాప్తులో హత్య కేసును పక్కదారి పట్టించేందుకు రూ.75 లక్షల భారీ లంచం వ్యవహారం జరిగినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. కేసు నమోదు కాకుండా ఉండేందుకు ఓ ఉన్నత పోలీసు అధికారికి రూ.25 లక్షలు అందించగా, మిగిలిన రూ.50 లక్షలను కిందిస్థాయి పోలీసులు, స్థానిక రాజకీయ నాయకులు, ఇతరులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారంపై విచారణ అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సీఐతో పాటు మొత్తం 23 మంది సిబ్బందిపై బదిలీ చర్యలు తీసుకున్నారు. సీఐను వీఆర్‌కు పంపడంతో పాటు సస్పెన్షన్‌కు ఎస్పీ సిఫార్సు చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, హత్య కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు హరికృష్ణ మంగళవారం తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గూడ్స్ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది.

గమనిక: పై వివరాలు అందుబాటులో ఉన్న సమాచారం, ఆరోపణలు మరియు దర్యాప్తు వివరాల ఆధారంగా రూపొందించబడ్డాయి. లంచం, కుట్ర తదితర అంశాలపై అధికారిక దర్యాప్తు, న్యాయ ప్రక్రియ పూర్తయ్యే వరకు అవి ఆరోపణలుగానే పరిగణించాలి.