BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

కోటపాడు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Apr, 2026 - 07:53 PM
119 వీక్షణలు

కోటపాడు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం – నెరవేరుతున్న చిరకాల కోరిక

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ రహదారి నిర్మాణం ఇప్పుడు కార్యరూపం దాల్చడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం 1300 మీటర్ల పొడవుతో రూ.70 లక్షల వ్యయంతో ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా తూర్పు బజార్ రోడ్ వరకు 650 మీటర్ల పొడవు, సుమారు 3.7 మీటర్ల వెడల్పుతో రూ.35 లక్షల వ్యయంతో పనులు జరుగుతున్నాయి.

గతంలో ఈ రహదారి బురదమయం, గుంతలతో ఉండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలు దాదాపు అసాధ్యంగా మారి విద్యార్థులు, వృద్ధులు, రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొనేవారు.

ఈ సమస్యను గుర్తించిన టీడీపీ నాయకుడు మంచిన పూర్ణ చంద్రరావు, మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన మంత్రి నిధులు మంజూరు చేయించారు. ప్రస్తుతం ఆ నిధులతో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

పనులు పూర్తయిన తర్వాత గ్రామంలో రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడి, ప్రజల దైనందిన జీవితం సులభతరం కానుంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజల తరఫున మోరంపూడి జయరాం కృతజ్ఞతలు తెలిపారు.

ఇంకా గ్రామంలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం మిగిలి ఉందని, అది కూడా పూర్తయితే కోటపాడు గ్రామంలో రవాణా సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.