BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

కోటపాడు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Apr, 2026 - 07:53 PM
85 వీక్షణలు

కోటపాడు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం – నెరవేరుతున్న చిరకాల కోరిక

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ రహదారి నిర్మాణం ఇప్పుడు కార్యరూపం దాల్చడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం 1300 మీటర్ల పొడవుతో రూ.70 లక్షల వ్యయంతో ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా తూర్పు బజార్ రోడ్ వరకు 650 మీటర్ల పొడవు, సుమారు 3.7 మీటర్ల వెడల్పుతో రూ.35 లక్షల వ్యయంతో పనులు జరుగుతున్నాయి.

గతంలో ఈ రహదారి బురదమయం, గుంతలతో ఉండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలు దాదాపు అసాధ్యంగా మారి విద్యార్థులు, వృద్ధులు, రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొనేవారు.

ఈ సమస్యను గుర్తించిన టీడీపీ నాయకుడు మంచిన పూర్ణ చంద్రరావు, మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన మంత్రి నిధులు మంజూరు చేయించారు. ప్రస్తుతం ఆ నిధులతో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

పనులు పూర్తయిన తర్వాత గ్రామంలో రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడి, ప్రజల దైనందిన జీవితం సులభతరం కానుంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజల తరఫున మోరంపూడి జయరాం కృతజ్ఞతలు తెలిపారు.

ఇంకా గ్రామంలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం మిగిలి ఉందని, అది కూడా పూర్తయితే కోటపాడు గ్రామంలో రవాణా సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.