BREAKING
మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం...
www.ntodaynews.com

కోటపాడు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Apr, 2026 - 07:53 PM
50 వీక్షణలు

కోటపాడు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం – నెరవేరుతున్న చిరకాల కోరిక

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ రహదారి నిర్మాణం ఇప్పుడు కార్యరూపం దాల్చడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం 1300 మీటర్ల పొడవుతో రూ.70 లక్షల వ్యయంతో ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా తూర్పు బజార్ రోడ్ వరకు 650 మీటర్ల పొడవు, సుమారు 3.7 మీటర్ల వెడల్పుతో రూ.35 లక్షల వ్యయంతో పనులు జరుగుతున్నాయి.

గతంలో ఈ రహదారి బురదమయం, గుంతలతో ఉండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలు దాదాపు అసాధ్యంగా మారి విద్యార్థులు, వృద్ధులు, రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొనేవారు.

ఈ సమస్యను గుర్తించిన టీడీపీ నాయకుడు మంచిన పూర్ణ చంద్రరావు, మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన మంత్రి నిధులు మంజూరు చేయించారు. ప్రస్తుతం ఆ నిధులతో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

పనులు పూర్తయిన తర్వాత గ్రామంలో రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడి, ప్రజల దైనందిన జీవితం సులభతరం కానుంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజల తరఫున మోరంపూడి జయరాం కృతజ్ఞతలు తెలిపారు.

ఇంకా గ్రామంలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం మిగిలి ఉందని, అది కూడా పూర్తయితే కోటపాడు గ్రామంలో రవాణా సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.