కోటపాడులో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి అందించిన సేవలను, పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం చేపట్టిన పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మోదుగుమూడి మాధవరావు, శివ, చెన్నారావు, పోలగాని ప్రసాద్, అబ్బదాసరి బాలస్వామి, పాపారావు తదితరులు పాల్గొన్నారు.