BREAKING
5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం
www.ntodaynews.com

కోటపాడులో తరచూ కరెంటు కోతలు.. ప్రజల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 May, 2026 - 05:15 AM
101 వీక్షణలు

కోటపాడులో తరచూ కరెంటు కోతలు.. ప్రజల ఆగ్రహం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో తరచూ జరుగుతున్న కరెంటు కోతలతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజులుగా రాత్రి సమయాల్లో స్వల్ప గాలి వీచినప్పటికీ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు.

కరెంటు లేకపోవడంతో చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దోమల బెడద పెరిగి జ్వరాల బారిన పడుతున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. గంటల తరబడి విద్యుత్ లేకపోవడంతో ఇన్వర్టర్లు కూడా పనిచేయకుండా డౌన్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు రెండు గంటలకుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇళ్లలో ఉండలేక బయట రోడ్డుపై ఆరుబయట కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. శనివారం సాయంత్రం ఐదు గంటలకు నిలిచిపోయిన కరెంటు ఆదివారం ఉదయం పది గంటలైనా పునరుద్ధరించకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామస్తులు మండిపడ్డారు.

ఇలాంటి తీవ్ర కరెంటు కోతలు గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్న గ్రామస్తులు, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు.