BREAKING
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..! విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..!
www.ntodaynews.com

కోటపాడులో తరచూ కరెంటు కోతలు.. ప్రజల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 May, 2026 - 05:15 AM
51 వీక్షణలు

కోటపాడులో తరచూ కరెంటు కోతలు.. ప్రజల ఆగ్రహం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో తరచూ జరుగుతున్న కరెంటు కోతలతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజులుగా రాత్రి సమయాల్లో స్వల్ప గాలి వీచినప్పటికీ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు.

కరెంటు లేకపోవడంతో చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దోమల బెడద పెరిగి జ్వరాల బారిన పడుతున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. గంటల తరబడి విద్యుత్ లేకపోవడంతో ఇన్వర్టర్లు కూడా పనిచేయకుండా డౌన్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు రెండు గంటలకుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇళ్లలో ఉండలేక బయట రోడ్డుపై ఆరుబయట కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. శనివారం సాయంత్రం ఐదు గంటలకు నిలిచిపోయిన కరెంటు ఆదివారం ఉదయం పది గంటలైనా పునరుద్ధరించకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామస్తులు మండిపడ్డారు.

ఇలాంటి తీవ్ర కరెంటు కోతలు గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్న గ్రామస్తులు, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు.