BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

కోటపాడులో తరచూ కరెంటు కోతలు.. ప్రజల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 May, 2026 - 05:15 AM
144 వీక్షణలు

కోటపాడులో తరచూ కరెంటు కోతలు.. ప్రజల ఆగ్రహం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో తరచూ జరుగుతున్న కరెంటు కోతలతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజులుగా రాత్రి సమయాల్లో స్వల్ప గాలి వీచినప్పటికీ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు.

కరెంటు లేకపోవడంతో చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దోమల బెడద పెరిగి జ్వరాల బారిన పడుతున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. గంటల తరబడి విద్యుత్ లేకపోవడంతో ఇన్వర్టర్లు కూడా పనిచేయకుండా డౌన్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు రెండు గంటలకుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇళ్లలో ఉండలేక బయట రోడ్డుపై ఆరుబయట కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. శనివారం సాయంత్రం ఐదు గంటలకు నిలిచిపోయిన కరెంటు ఆదివారం ఉదయం పది గంటలైనా పునరుద్ధరించకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామస్తులు మండిపడ్డారు.

ఇలాంటి తీవ్ర కరెంటు కోతలు గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్న గ్రామస్తులు, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు.