BREAKING
ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ..
Date of Publish : 01 September 2026, 04:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కూతురి చదువు కోసం.. చెప్పులు లేకుండానే పరుగెత్తి మారథాన్ విజేతగా నిలిచిన తల్లి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 04:50 PM
34 వీక్షణలు

మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగాయి ప్రాంతానికి చెందిన 47 ఏళ్ల రమాబాయి పట్టుదలకు, త్యాగానికి ప్రతీకగా నిలిచారు. భర్తను కోల్పోయిన ఆమె కూలి పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తున్నారు.

కూతురి చదువు కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రమాబాయి.. మారథాన్‌లో గెలిస్తే వచ్చే బహుమతి డబ్బు ఉపయోగపడుతుందని తెలుసుకున్నారు. వెంటనే అమృత్ దౌడ్ పేరుతో నిర్వహించిన మారథాన్‌లో పాల్గొన్నారు.

పరుగులో మధ్యలో ఆమె వేసుకున్న చెప్పులు తెగిపోయాయి. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. తెగిపోయిన చెప్పులను చేతిలో పట్టుకుని చెప్పులు లేకుండానే పరుగు కొనసాగించారు. చివరకు 3 కిలోమీటర్ల మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసి రూ.3 వేల నగదు బహుమతిని అందుకున్నారు.

ఆ మొత్తం పెద్దది కాకపోయినా.. తన కూతురి చదువు ఫీజుకు ఎంతో ఉపయోగపడుతుందని రమాబాయి ఆనందం వ్యక్తం చేశారు. ఆమె మాటలు విన్న అక్కడున్న వారు భావోద్వేగానికి గురై రమాబాయి త్యాగాన్ని, పట్టుదలను అభినందించారు.

కుటుంబం కోసం ఓ తల్లి చేసిన ఈ పోరాటం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.