BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

​కూతురిని అమ్మేసిన కసాయి తండ్రి

తెలంగాణ
/ నల్గొండ
26 Mar, 2026 - 07:16 AM
388 వీక్షణలు

​కూతురిని అమ్మేసిన కసాయి తండ్రి

తాతయ్య, అమ్మమ్మల ఆవేదన

నల్గొండ జిల్లా ​పెద్ద అడిశర్లపల్లి కలకలం

కన్నప్రేమను మరిచి, కన్నకూతురినే కాసుల కోసం విక్రయించిన అమానవీయ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అమ్మ లేని బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, ఆ పసికందును అమ్మకానికి పెట్టిన తీరు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే ​పెద్ద అడిశర్లపల్లి మండలం పెద్దగట్టు గ్రామానికి చెందిన ధనావత్ మధు భార్య ప్రసవ సమయంలో మరణించింది. భార్య మరణానంతరం ఆ పసికందు మధు సంరక్షణలోనే ఉంది. అయితే, కొంతకాలంగా పాప కనిపించకపోవడంతో అమ్మమ్మ, తాతయ్యలకు అనుమానం వచ్చింది. పాప గురించి ఆరా తీయగా, ఆ పాప చనిపోయిందని మధు సమాధానం చెప్పాడు. తండ్రి ప్రవర్తనపై అనుమానం కలిగిన బాధిత కుటుంబ సభ్యులు, మధు తన కూతురిని డబ్బుల కోసం ఎవరికో విక్రయించాడని ఆరోపిస్తున్నారు.